సిద్దిపేట కమాన్, ఆగస్టు 26 : సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని కోమటి చెరువు మరో అద్భుత ఘట్టానికి వేదికైంది. ఆదివారం 450 డ్రోన్లతో సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా మెగా డ్రోన్ షో జరుగనున్నది. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు వీక్షించనున్నారు.
సాయంత్రం 6.30 గంటలకు డ్రోన్ల ద్వారా అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు కనువిందు చేయనున్నది. భూమి నుంచి వంద మీటర్ల ఎత్తులో కాంతి వెలుగులో సిద్దిపేట అభివృద్ధిని ఆవిష్కరించనున్నారు. సినీ గాయనీ గీతామాధురి బృందం ఆట పాటలతో అలరించనున్నారు.