Chandru | తెలంగాణలో మరో మూడు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. నల్గొండ జిల్లా చండూరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే, ఈ నెల ప్రారంభంలో చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో చండూరులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చండూరును రెవెన్యూ డివిజన్గా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం నల్లగొండ జిల్లాలోని చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసింది.
చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలాలను కలుపుతూ ఏర్పాటు చేసింది. అదే సమయంలో రాష్ట్రంలో మరో మూడు మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేసింది. నల్లగొండ జిల్లా అమ్మనబోలును రెవెన్యూ మండలంగా ప్రతిపాదిస్తూ ప్రైమరీ నోటిఫికేషన్ విడుదలైంది. అమ్మనబోలు, ఉప్పలంచ గ్రామాలతో కొత్త మండలం ప్రతిపాదించింది. అలాగే సూరారం, బీ తుర్కపల్లి, కుంకుడుపాముల గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అభ్యంతరాలను స్వీకరించనున్నది. మరో వైపు కామారెడ్డి జిల్లాలో మహమ్మద్నగర్ మండలాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.