హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేఆర్ఎంబీని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
విద్యుత్తు ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను విడుదల చేయడాన్ని ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై తదుపరి విచార ణను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్మిట్టల్ ధర్మాసనం నవంబరు 21కి వాయిదా వేసింది.