నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్(Nagar kurnool) జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident )లో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జిల్లాలోని కల్వకుర్తి మండల పరిధిలోని తుర్కలపల్లి గేట్ వద్ద అతి వేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న తుర్కలపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య (40), పల్లె రామస్వామి (42) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు(Police ) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.