హైదరాబాద్, జనవరి 17(నమస్తే తెలంగాణ): ఒకే ఫాస్టాగ్తో పలు వాహనాలు వినియోగిస్తుండడం, కేవైసీ పూర్తికాకుండానే ఫాస్టాగ్లను జారీచేస్తున్నట్టు గుర్తించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘వన్ వెహికిల్.. వన్ ఫాస్టాగ్’ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇకపై ఫాస్టాగ్ వినియోగదారులు తప్పకుండా కేవైసీ పూర్తిచేయాల్సిందేనంటూ అందుకు ఈ నెల 31 వరకు గడువు విధించింది. ఆ తర్వాత ఫాస్టాగ్లు డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు ఆ లోపు కేవీసీ పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది.
వినియోగదారుడు తొలుత ఫాస్టాగ్ అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవాల్సి ఉంటుంది. ఓటీపీ అథెంటిఫికేషన్ పూర్తయిన తర్వాత డ్యాష్బోర్డులో మై ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లి కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
ఫాస్టాగ్ కేవైసీ పెండింగ్లో ఉంటే సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం అవసరమైన గుర్తింపుకార్డుతోపాటు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్తోపాటు పాస్పోర్ట్సైజ్ ఫొటో కావాల్సి ఉంటుంది. అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్చేసుకుని సబ్మి ట్ బటన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూపై క్లిక్చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది.