జోగులాంబ గద్వాల : ధాన్యం తడిసిందని రైతులు ఎవరు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి జిల్లాలో కురిసిన వర్షానికి గద్వాల నియోజకవర్గంలోని ధరూర్, మల్దకల్ మండలంలోని బిజ్జారం గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లోని తడిచిన ధాన్యాన్ని ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తడిచిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచుల కొరత లేకుండా చూస్తామన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ రాజారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
బ్లాక్లో రెమ్డెసివర్ ఇజక్షన్లు..ముగ్గురి అరెస్ట్
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర్
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి