మెట్పల్లి, ఏప్రిల్ 28: మక్కల కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియాతో మాట్లాడారు.
యాసంగిలో పండించిన మక్కలకు ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్కు రూ.1,600 లోపు మాత్రమే ధర పలుకుతున్నదని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.