హైదరాబాద్ : కామారెడ్డి(Kamareddy) జిల్లా బిక్కనూరులో(Bikkanur) రైతులు(Farmers) ఆగ్రహంతో రెడ్డెక్కారు. వడగళ్ల వానకు నష్టపోయిన రైతులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బిక్కనూరు మండలం అంతంపల్లి శివారులోని జాతీయ రహదారిపై(National highway) రెండు గంటల పాటు ధర్నా(Dharna) చేపట్టారు.
అకాల వర్షాలు(Rains) పంటలను(Crops damage)తీవ్రంగా దెబ్బతీశాయని, లక్షల రూపాయల పెట్టుబడి పెట్టడంతో అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.