Rythu bandhu | రైతులకు పెట్టుబడి గోస తీర్చే రైతుబంధు పథకంపై విషం కక్కిన కాంగ్రెస్(Congress) పార్టీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రైతుబంధు(Rythu bandhu) పథకాన్ని ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆదోళనలు చేపట్టారు. పలుచోట్ల కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.