భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లిలో కరెంటు కోతలపై రైతులు ఆందోళనకు దిగారు. మండలంలో రోజుకు 8గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని.. అదికూడా ఉదయం 4 నుంచి 7వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, సాయం త్రం మరో 3గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కరెంటుకోతలతో నాలుగు రోజుల్లో నాలుగుసార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ కరెంటు తీగలను పట్టుకొని ఇలా నిరసన తెలిపారు.
– సంస్థాన్ నారాయణపురం