Farmers | మంథని, మార్చి 14 : రెండు రోజుల్లో పంటలకు నీళ్లిస్తామన్న అధికారులు వారం రోజులైనా పట్టించుకోకపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. పురుగుల మందు డబ్బాలు, ఎండిన వరిపైరుతో ఎర్రటి ఎండలో గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలో పెద్దపల్లి- కాటారం రహదారిపై నాలుగు గంటలపాటు బైఠాయించారు.
ఈ నెల 7న మంథని మండలం సూరయ్యపల్లి, కాకర్లపల్లి, మైదుపల్లి, ముత్తారం మండలం రామకృష్టాపూర్, గంగాపురి గ్రామాల రైతులు సాగునీటి కోసం నిరసన తెలుపగా, ఆర్టీవో హనుమానాయక్ రెండు రోజుల్లో నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అయితే వారం దాటినా నీటిని విడుదల చేయడంతో మళ్లీ ఆందోళన బాట పట్టారు.
విషయం తెలుసుకున్న ఆర్డీవో హనుమానాయక్, ఈఈ బలరాంనాయక్ రైతుల వద్దకు వచ్చి శాంతిపజేసేందుకు విఫలయత్నం చేశారు. గతంలో నీళ్లిస్తామన్న హామీని ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. దీంతో గోదావరిఖని ఏసీపీ రమేశ్ సమస్యను కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.