గుండాల/యాదాద్రి భువనగిరి : రైతులను తప్పదోవ పట్టిస్తూ పూటకో మాట మాట్లాడుతున్న బీజేపీ నేతలకు రైతులు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా గుండాల మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీనలకు వచ్చిన యాదాద్రి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామసుందర్న రైతులు అడ్డగించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో బీజేపీ నాయకులు హడావుడి చేయబోగా అక్కడే ఉన్న రైతులు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని బీజేపీ నాయకులను అడ్డుకున్నారు.
వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ నాయకులు తోకముడిచి వెనుతిరిగి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసం
Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం