మహబూబ్నగర్ : జిల్లాలో కాంగ్రెస్ సర్కార్ రైతుబంధు(Rythu Bandhu) పైసలు రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది. కాగా, హన్వాడ మండలానికి చెందిన ఓ రైతు( Farmer)కు రైతుబంధు డబ్బులు కేవలం ఒక్క రూపాయి మాత్రమే తన ఖాతాలో జమకావడంతో అవాక్కయ్యాడు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుబంధు ఏడాదికి రెండుసార్లు ఎకరానికి రూ.10 వేల చొప్పున పడేవి. కానీ ఈ సారి పాండురంగా రెడ్డికి ఈ యసంగికి కేవలం ఒక్క రూపాయి పడటంతో ఖంగుతిన్నాడు.
ఇదే మండలానికి చెందిన టంకర గ్రామానికి చెందిన ఆంజనేయులుకు రూ. 62 జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇతనికి గ్రామంలో రెండుగంటల భూమి ఉంది. ప్రతిసారి రూ.250 పడేవి. ఈ సారి కేవలం రూ.62 పడింది. చాలా మంది రైతులకు ఇంకా డబ్బులు పడలేదు. ఒక ఎకరంతో ప్రారంభించి రైతుబంధు వేస్తామని చెప్పిన కొత్త సర్కార్.. ఇంకా రైతుబంధు జమ చేయక పోవడంతో యసంగీ సాగుకు ఇక అప్పులు తప్పవేమో అనే ఆందోళన చెందుతున్నారు.