ఆదిలాబాద్ : జిల్లాలో పత్తి(Cotton) కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు(Farmers Protesting). ఆదిలాబాద్(Adilabad) మార్కెట్ యార్డుకు శుక్రవారం పంటను విక్రయించడానికి వాహనాల్లో రైతులు భారీగా పత్తిని తీసుకువచ్చారు. నిలువ చేసిన పత్తి బేళ్ల సరఫరా నిలిచిపోయిందంటూ సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లను నిరాకరించారు. ఉదయం 5 గంటల నుంచి రైతులు వాహనాల్లో పంటను తీసుకురావడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా పత్తి కొనుగోలు నిలిపి వేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే పంట కొనుగోలను ప్రారంభించాలని కలెక్టర్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ శ్యామలాదేవి వ్యాపారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కొద్దిసేపట్లో పంటను కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు.