గంభీరావుపేట, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ పాలనలో రైతన్నను సమస్యలు నిత్యం వెంటాడుతున్నాయి. ఓవైపు సాగునీటి కొరత.. మరోవైపు కరెంట్ వ్యథలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగరం నిదర్శంగా నిలిచింది.. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్పై ఓవర్లోడ్ పడుతుండడంతో తరచూ కాలిపోతున్నది. ఫలితంగా కరెంట్లేక ఇక్కడి రైతులు పొలానికి నీరు పారించుకోలేని పరిస్థితి దాపురించింది.
మూడురోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోగా, ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు.. దీంతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయని శనివారం ట్రాన్స్ఫార్మర్ వద్ద రైతులు నిరసన తెలిపారు. అధికారులు స్పందించి ఓవర్ లోడ్ సమస్య పరిష్కరించడంతోపాటు, ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు శింవది దేవయ్య, అక్బర్, దేవేందర్, దోమకొండ రాజయ్య, కృష్ణకాంత్, శ్రీనివాస్, భూమయ్య, రాములు, నర్సయ్య, కంటె దేవయ్య తదితరులు ఉన్నారు.