కుభీర్, జనవరి 11 : విద్యుత్తు కోతలకు నిరసనగా నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ఎదుట భైంసా-కుభీర్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. రహదారిని గంట సేపు దిగ్బంధించారు. శనివారం కుభీర్తోపాటు ఆయా గ్రామాల రైతులు ముందుగా సబ్ స్టేషన్ వెళ్లి కరెంట్ కోతలపై సిబ్బందిని నిలదీశారు. అనంతరం రోడ్డుపై ధర్నాకు దిగారు. వెంటనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మాగనూరు, జనవరి 11: లోవోల్టేజీ సమస్యతో బోర్లు కాలిపోతున్నాయంటూ నారాయణపేట జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. 3 నెలలుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కొ ల్పూరు, మందిపల్లి, పుంజనూరు, మూడుమాల్, గజ్రందొడ్డి గ్రామాల రైతులు శనివారం కొల్పూర్ సబ్స్టేషన్లో లైన్మన్తో వాగ్వాదానికి దిగారు. సమస్య చెప్పినా స్పందనే లేదంటూ నిరసన తెలిపారు.