గూడూరు, మార్చి 28: విద్యుత్తు మోటర్ను అమర్చబోయి కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మధనాపురం గ్రామశివారు ధూపతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన రైతు మాలోత్ లాలు(50)తన పొలంలో విద్యుత్తు తీగను సరి చేస్తుండగా షాక్కు గురై బావిలో ఉన్న మోటర్పై పడిపోయాడు.పక్కనున్న భార్య పద్మ గమనించి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల రైతులు వచ్చి బయటకు తీసి చూడగా అప్పటికే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒక కూతురికి నెల రోజుల్లో వివాహం జరగాల్సి ఉన్నదని బంధువుల తెలిపారు. లాలు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నగేష్ తెలిపారు.