రామాయంపేట, ఏప్రిల్ 27 : అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన మెదక్ జిల్లా రామాయంపేట మండ లం అక్కన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన రైతు పాపయ్యగారి మల్లేశం (35) శనివారం రామాయంపేటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. మార్గమధ్యంలో అక్కన్నపేట శివారులో పురుగులమందు తాగి ఆత్మహత్యకు య త్నించాడు. గమనించిన స్థానికులు రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు వెంటనే కుటుంబీకులు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించగా, సోమవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మృతిచెందాడు. మల్లేశం తనకున్న అర ఎకరంతో పాటు రెండెకరాలు కౌలుకు తీసుకుని అప్పుచేసి పంటలు సాగుచేశాడు. ఏడాది క్రితం తన కూతురు పెండ్లి చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో ఆందోళనకు గురై పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య ఇందిర, కూతురు, కొడుకు ఉన్నారు. రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.