టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శనివారం నాడు ఒక అభిమాని కరెన్సీ నాణెలతో కవిత ముఖచిత్రాన్ని తయారు చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పగా… ఇప్పుడు మరికొందరు యువకులు కూడా విభిన్నంగా కవితపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్కు చెందిన చిన్ను గౌడ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి అరేబియా సముద్రంలో మోటార్ బోట్లపై తిరుగుతూ కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అరేబియా మహా సముద్రం ఒడ్డున మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగం సమీపాన సముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫొటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. @RaoKavitha pic.twitter.com/DbNo7ulbAu
— Namasthe Telangana (@ntdailyonline) March 13, 2022