‘అన్నా అంటే.. నేనున్నా’ అంటూ ఆపద సమయాల్లో అండగా ఉండే మంత్రిహరీశ్రావుపై ఓ కుటుంబం తమ అభిమానాన్ని చాటుకున్నది. రానున్న ఎన్నికల్లో తమ మద్దతు హరీశ్రావుకేనని పేర్కొంటూ సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డుకు చెందిన మహ్మద్ చాంద్ తన ఇంటికి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తమకుటుంబంలోని 17 ఓట్లన్నీ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీశ్రావుకే వేస్తామని అందులో పేర్కొన్నారు. ఇతర పార్టీల వారు తమ ఇంటికి ప్రచారానికి రావద్దంటూ చాంద్ సూచించారు.
– సిద్దిపేట