జహీరాబాద్, జూన్ 2 : ప్రభుత్వ అనుమతి లేని సోయా విత్తనాలు నిల్వ చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన 150 బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు.
గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాడిమాల్కాపూర్ గ్రామంలో ఉన్న రాధాకృష్ణ ఎరువుల దుకాణం యజమాని అక్రమంగా సోయా విత్తనాలు నిల్వ చేశారనే సమాచారంతో జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ భిక్షపతి, ఏవో వినోద్కుమార్ దాడి చేసి సరుకును సీజ్ చేశారు. వీటి విలువ మార్కెట్లో రూ.5.25 లక్షలు ఉంటుందన్నారు. రాధాకృష్ణ ఫెర్టిలైజర్ షాపు యజమానిపై కేసు నమోదు చేసినట్టు ఏడీఏ భిక్షపతి తెలిపారు.