జగిత్యాల కలెక్టరేట్, జూన్ 5: దొంగనోట్లు మార్పిడి చేస్తూ ఐదుగురు సభ్యుల ముఠా జగిత్యాల పోలీసులకు చిక్కింది. వీరి వద్ద రూ.15 లక్షల నకిలీ, రూ.3 లక్షల అసలు నోట్లు దొరికాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన మేక శేఖర్ గతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసి ఆర్థికంగా నష్టపోయాడు.
అనంతరం నకిలీ నోట్ల దందాలోకి దిగాడు. మర్శకోల రాధాకిషన్, ఎర్రోళ్ల శ్రీనివాస్గౌడ్, విజ్జగిరి భిక్షపతి, విజ్జగిరి శ్రీకాంత్తో కలిసి హైదరాబాద్ నుంచి నకిలీ 500 నోట్లు తీసుకొచ్చాడు. వాటిని మార్పిడి చేసేందుకు ఆదివారం ఉదయం జగిత్యాల కొత్త బస్టాండ్ వద్దకు వచ్చిన ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.