హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదివారం రూ.38 లక్షల విలువైన 9,120 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
రూ.6.75 లక్షల విలువైన 27 కిలోల గంజాయి, రూ.1.3 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మొత్తంగా రూ.46.12 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు