హైదరాబాద్, జనవరి13 (నమస్తే తెలంగాణ): కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) ప్రకటించిన అవార్డును పాక్షికంగానైనా అమలు చేసేలా గెజిట్ నోటిఫికేషన్ కోసం ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టుకు కర్ణాటక మరోసారి విజ్ఞప్తి చేసింది. మూడు రోజులుగా ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం బెంచ్ విచారించిన విషయం తెలిసిందే. అయినా వాదనలు ముగిసిపోలేదు. పిటిషన్ విచారణను త్వరితగతిన జరిపించాలని, ఈ మేరకు ప్రస్తుత బెంచ్కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ శుక్రవారం సీజేఐకి కర్ణాటక విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణను ఈ నెల 20న కొనసాగించాలని ప్రస్తుత బెంచ్కు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది.