హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): 2023-2025 సంవత్సరాలకుగాను ఐదు జిల్లాల్లోని 22 మద్యం దుకాణాలకు రీ-టెండర్ ద్వారా కొత్తగా 251 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు సోమవారం తెలిపారు. అంతుకు ముందే వచ్చిన దరఖాస్తులతో కలుపుకొంటే 22 షాపులకు మొత్తం 379 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు.
ఆదిలాబాద్లో 9, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 5, నిర్మల్లో 4, జయశంకర్ భూపాలపల్లిలో 3, కామారెడ్డిలో 1 మద్యం దుకాణాలకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు లక్కీడ్రా తీయనున్నారు. ఆ వెంటనే విజేతలకు షాపులు కేటాయిస్తారు.