హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ ఎక్సైజ్శాఖ ముమ్మరంగా చేపడుతున్నట్టు తనిఖీలను పొరుగు రాష్ర్టాల ఎక్సైజ్ అధికారులు కొనియాడారు. శనివారం తెలంగాణ, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు హైదరాబాద్లోని హోటల్ తాజ్కృష్ణలో అంతర్ రాష్ట్ర సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ ఎక్సైజ్ సునీల్శర్మ ఐఏఎస్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎక్సైజ్ అధికారుల పనితీరును, ఎన్ఫోర్స్మెంట్ చేపడుతున్న దాడులను కొనియాడారు. ఎన్నికల సంఘం అంచనాలకు మించి అన్ని రాష్ర్టాల ఎక్సైజ్ అధికారులు పనిచేయాలని ఆదేశించారు.