Jagdish Reddy | తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్పై ఎదురుదాడి చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చెప్పుదెబ్బలు కొడతారన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్టులను అప్పగించారన్నారు. కేసీఆర్ మాట్లాడక ముందే కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో ప్రాజెక్టులు అప్పగించి.. కాంగ్రెస్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్ నేతలేనన్నారు. కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మేమే నిలదీస్తామన్నారు. ఎవరు ద్రోహులు తేల్చుకుందామన్నారు. కేంద్రానికి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు.