Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు ఆపడం సరికాదని హరీశ్రావు పేర్కొన్నారు. పెన్షన్లలో కోతలు విధించడమంటే.. వారి నోటికాడి బుక్కను లాగేసుకోవడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరు గ్రామ పంచాయతీలో కొడుకు ఇంటి పన్ను కట్టలేదని తల్లి వృద్ధాప్య పెన్షన్లో కోత విధించిన ఘటనపై హరీశ్రావు స్పందించారు.
కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం అని హరీశ్రావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి. పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే, ఆ వృద్ధుల బతుకు బండి నడిచేది ఎట్ల? అని హరీశ్రావు ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తే ప్రతి నెలా రూ.4 వేలు పింఛన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు వచ్చే రూ. 2 వేల పింఛన్ను గుంజుకోవడం దుర్మార్గమైన చర్య అని హరీశ్రావు మండిపడ్డారు. ఒకవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ, మరో వైపు చేతికందిన పింఛన్ను ఇంటి పన్ను బకాయిలో జమ చేయడం శోచనీయం అని హరీశ్రావు పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని, ఇంటిపన్ను, ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఐటీ ఇండస్ట్రీలో ఉండాలంటే నిజమైన ప్రతిభ.. అంకితభావం అవసరం.. సీఎం రేవంత్కు కేటీఆర్ కౌంటర్