Mallareddy | హైదరాబాద్ సుచిత్ర చౌరస్తా సమీపంలోని సర్వే నంబర్ 82లో భూవివాదం నెలకొంది (land dispute). మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), మరో వర్గం మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భూ వివాదం విషయంలో సుమారు 15 మంది వ్యక్తులు మల్లారెడ్డితో గొడవకు దిగారు.
మల్లారెడ్డికి చెందిన రెండెకరాల భూమిలోకి కాంగ్రెస్ పార్టీ విప్ లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి అనుచరులు అక్రమంగా చొరబడి వీరంగం సృష్టించారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (MLA Marri Rajasekhar Reddy) వెంటనే అక్కడికి చేరుకున్నారు. తన భూమిలో వంద మంది గూండాలు దౌర్జన్యంగా చొరబడి పాగా వేశారని మల్లారెడ్డి ఆరోపించారు. పోలీసు యంత్రాంగం సైతం వాళ్లవైపే మాట్లాడటం దౌర్జన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూమి చుట్టు అక్రమంగా ఫెన్సింగ్ వేశారన్నారు. దానిని తొలగించాలని అనుచరులకు ఆదేశించారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ సీఎస్కు తరలించారు.
తన స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం
కుత్బుల్లాపూర్ – పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని బారికెడ్లను పెట్టి కొందరు కబ్జా చేశారు.
స్థలంలో వేసిన బారికెడ్లను తొలగిస్తున్న మాజీ మంత్రి… pic.twitter.com/Uc0GAiGOYL
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2024
Also Read..
Swati Maliwal | కేజ్రీవాల్ నివాసం నుంచి స్వాతి మలివాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. తాజా వీడియో
Kyrgyzstan | కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా మూక హింస.. కేంద్రం అలర్ట్
Taiwan parliament | రణరంగంగా తైవాన్ పార్లమెంట్.. పిడిగుద్దులు గుద్దుకున్న ఎంపీలు