నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 15: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజా నాడి తెలిసిన కేసీఆర్.. ఓటు కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం అమలయ్యే హామీలతో మ్యానిఫెస్టో రూపొందించారంటూ ఆదివారం తెలంగాణ నేలంతా సంబురాలతో మారుమోగిపోయింది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొన్నది. మనసున్న సీఎం అంటూ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. మళ్లీ కేసీఆరే సీఎం అవుతారంటూ ఊరూరా పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. దీంతో తెలంగాణ కోలాహలంగా మారింది. కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటిస్తున్న క్రమంలోనే తెలంగాణ భవన్ ప్రాంగణంలో గులాబీ రంగు పూసుకొని పార్టీ కార్యకర్తలు డప్పు చప్పుళ్లు.. నృత్యాలతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ లాగా మరొకరు భరోసా ఇవ్వలేరని ఈ మ్యానిఫెస్టో తేల్చిచెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గుదిబండగా మారిన గ్యాస్ సిలిండర్ బారాన్ని ప్రభుత్వమే భరిం చే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రతి గృహిణీ గులాబీ పార్టీకి జై కొడుతుందని రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సంబురాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో పటాకలు పేల్చి దివ్యాంగులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 19న తెలంగాణ భవన్లో వికలాంగులందరం కలిసి సభ ఏర్పాటు చేసి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నది. రాష్ట్రంలో 1954 నుంచి సుమారు 13 లక్షల మంది కి అసైన్డ్ పట్టాలు ఇచ్చినట్టు గణాంకాలు చెప్తున్నా యి. 21 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వాలు వారి కి కేటాయించాయి. ఆంక్షలు ఎత్తివేసి భూములపై తమకు సంపూర్ణ హక్కులు కల్పించాలని లబ్ధిదారు లు దశాబ్దాలుగా కోరుతున్నారు. వీరి వేదనను మానవీయ కోణంలో అర్థం చేసుకున్న కేసీఆర్.. ఆంక్షల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో 13 లక్షలకుపైగా కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ దివ్యాంగుల పాలిట దైవం. ఎన్నికల మ్యానిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్ను మరో రూ.2 వేలు పెంచుతూ మానవత్వం చాటారు. ఇలాంటి నాయకుడు తెలంగాణలో ఉండటం రాష్ట్రంలోని దివ్యాంగులు చేసుకున్న అదృష్టం. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అందుకుంటున్న 5.35 లక్షల మంది దివ్యాంగులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు దివ్యాంగులంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి కృతజ్ఞత చాటుకుంటాం. దేశంలో సీఎం కేసీఆర్ మాత్రమే పెద్ద మొత్తంలో దివ్యాంగులకు పింఛన్ అందిస్తున్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అద్భుతంగా ఉన్నది. ఇది తెలంగాణకే కాదు.. దేశమంతా అమలు చేయాల్సిన అవసరమున్నది. గత మ్యానిఫెస్టోలన్నింటినీ వందశాతం అమలు చేసిన సీఎంగా, మరోసారి అందరికీ ఆమోదయోగ్యమైన, ఆశాజనకమైన మ్యానిఫెస్టోను కేసీఆర్ ప్రకటించారు. ఆయన వంటి నిబద్ధత కలిగిన నేత దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టం. కేసీఆర్ అంటేనే నమ్మకం.. నమ్మకం అంటేనే కేసీఆర్. అందుకే.. తెలంగాణ ప్రజలందరూ ఈ మ్యానిఫెస్టోకు బ్రహ్మరథం పడుతున్నారు. మరోసారి సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తెలంగాణ రాష్ట్ర భవితకు భరోసానిచ్చేది. ఈ మ్యానిఫెస్టోతో ప్రజలు సంబురాల్లో మునిగితే.. ప్రతిపక్షాలు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయాయి. సీఎం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్తో ప్రతిపక్షాలు దికుతోచని స్థితిలో పడిపోయాయి. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నది.. రికార్డ్ సృష్టించబోతున్నది. విజన్, కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా గతంలో ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను సీఎం కేసీఆర్ సమర్థంగా అమలు చేశారు. ప్రస్తుత మ్యానిఫెస్టో హామీలనూ వందశాతం అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు.
ఈ మ్యానిఫెస్టో సబ్బండ వర్గాలకు కొండంత అండ. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరెకడా లేవు. ప్రస్తుతం కొనసాగిస్తున్న వాటిలో కొన్ని పథకాల పరిధిని పెంచేలా, లబ్ధిదారులకు మరింత మేలు జరిగేలా పలు అంశాలను మ్యానిఫెస్టోలో పొందుపర్చడం హర్షణీయం. సీఎం కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగం. ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం.
ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉన్నది. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యం. సామాజిక పింఛన్ల పెంపు లక్షల మంది అసహాయుల జీవనానికి ఆసరాగా నిలుస్తుంది. రైతుబంధును రూ.16 వేలకు పెంచి అన్నదాతలపై సీఎం కేసీఆర్ ప్రేమను, వ్యవసాయంపై తనకున్న వాత్సల్యాన్ని మరోసారి చాటారు. రూ.400కే గ్యాస్ కనెక్షన్ పేద కుటుంబాలకు ఊరటనిస్తుంది.
కేసీఆర్ చేసేదే చెప్తారు.. చెప్పింది కచ్చితంగా అమలు చేస్తారు. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఎకడా అమలులో లేని రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు పథకం అమలు ఘనత కేసీఆర్దే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలనూ అమలుచేసి ఆచరణలో చూపించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అమలు చేయలేక అభాసుపాలవుతున్న విషయం ప్రత్యక్షంగా కనిపిస్తున్నది.
రాష్ట్ర ప్రజలు అడగకుండానే తెలుసుకొని సీఎం కేసీఆర్ వారి అవసరాలను తీరుస్తున్నారు. ఇలా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే తలమానికంగా నిలిచింది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందన్న బలమైన నమ్మకంతో ప్రజలు ఉన్నారు.
ఈ మ్యానిఫెస్టో అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేస్తుంది. సౌభాగ్యలక్ష్మి పథకం భారతావనికే తలమానికం అవుతుంది. 400కే గ్యాస్ సిలిండర్, 5 లక్షల కేసీఆర్ బీమా, ఆసరా, రైతుబంధు సాయం పెంపు, ఆరోగ్యశ్రీ, అగ్రవర్ణ పేదలకు గురుకులాల వంటి హామీలు అద్భుతం. గ్రేటర్ పరిధిలో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు, పేదలకు ఇండ్లస్థలాలు, అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేతతో పేదలకు న్యాయం జరుగుతుంది.
ఇది నూరుశాతం పీపుల్స్ మ్యానిఫెస్టో. పేద మహిళలకు 3 వేల జీవన భృతిని ప్రకటించి వారి పట్ల కేసీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. 93 లక్షల కుటుంబాలకు బీమా ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం. ఇలా కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరి ఆత్మబంధువని మరోసారి రుజువైంది.
బీఆర్ఎస్కు ఈసారి వందసీట్లు దక్కడం ఖాయం. కేసీఆర్ అంటే మాట మీద నిలబడే నాయకుడు. చెప్పిన మాట చేసి తీరుతాడు. చెప్పనివి కూడా చేస్తాడని ప్రజలకు నమ్మకమున్నది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ 9 ఏండ్లల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, అన్ని వర్గాలను ఆదరిస్తూ వస్తున్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వెలువడగానే ఊరూరా దసరా, దీపావళి ముందే వచ్చినంత సంబురాలు జరిగాయి. ఇది ప్రజల్లో అంతులేని సంతోషాన్ని కలిగిస్తే.. విపక్షాలకు మాత్రం హార్ట్ స్ట్రోక్ను కలిగించింది. సీఎం కేసీఆర్ ఇచ్చే హామీలను జనం గుండెల్లో పెట్టుకుంటారు. తెలంగాణను అద్భుత విజయాల వైపు నడిపించిన కేసీఆర్ మరోసారి ప్రజామోదం పొందనున్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక మహిళలకు ఎంతో మేలు జరుగుతున్నది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల సంక్షేమానికి అనేక పథకాలను అమలుచేస్తున్నది. తాజాగా పేద కుటుంబాల మహిళలకు నెలకు రూ.3 వేలు జీవన భృతిని అందిస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. మాలాంటి పేదలకు జీవనభృతి ఎంతో ఉపయోగపడుతుంది.