Telangana Assembly Elections | బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో తన సత్తాను చాటలేకపోయారు. హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు. హుజురాబాద్లో ఈటల మూడోస్థానంలో కొనసాగుతున్నారు. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేసిన ఈటల రెండో స్థానంలో ఉన్నారు.
మరోవైపు కరీంనగర్లో బండి సంజయ్, కోరుట్లలో ధర్మపురి అరవింద్, దుబ్బాకలో రఘునందన్ రావు కూడా వెనుకంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.