హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మటన్ క్యాంటీన్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తొలి దశలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
ఇందులో భాగంగానే గురువారం మాసబ్ట్యాంక్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి, రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ భేటీ అయ్యారు. మటన్ క్యాంటీన్ల ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. జీహెచ్ఎంసీ నుంచి సహకారం అందించాలని దూదిమెట్ల కోరారు.