పెద్దపల్లి : జిల్లాలో కరోనా బారిన పడిన గర్భిణుల చికిత్స, డెలివరీ కోసం దవాఖాన ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సుల్తానాబాద్ లోని ప్రభుత్వ హాస్పిటల్ను కలెక్టర్ పరిశీలించారు. కరోనా బారినపడిన గర్భిణులకు చికిత్స అందించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా చికిత్స అందించేందుకు వీలుగా ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య పెంచుతున్నామని కలెక్టర్ తెలిపారు.
కరోనా చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి, మంథని, గోదావరిఖనిలలో ఐసోలేషన్ లో ఉండే వారి కోసం ప్రత్యేక కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణులు డెలివరీ కొసం ఇబ్బంది పడకుండా సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని మిగతా ప్రభుత్వ హాస్పిటల్స్లో కొవిడ్ లేని గర్భిణులకు డెలివెరీలు చేస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వాసుదేవ రెడ్డి, సుల్తానాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్, తాసిల్దార్ పాల్ సింగ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి స్రవంతి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు