Errabelli Dayakar Rao | అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయని, అనేక మంది రైతులు పంటలు నష్టపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రం కాదన్నా.. వద్దన్నా సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ధాన్యం కూడా తడవడం రైతులకు ఆశనిపాతంగా మారిందన్నారు. అయితే, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందంటూ రైతులకు మంత్రి భరోసానిచ్చారు.
దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలో ఆకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని మంత్రి మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లోతట్టు ప్రాంతంలో పెట్టడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, గోదాములకు తరలించాలని సూచించారు.
ఈ సందర్భంగా దేవరుప్పుల మండలం చిన్న మడూరు గ్రామంలో మంగళవారం జరిగిన రేణుక ఎల్లమ్మ పండుగ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తులందరనీ చల్లగా చూడాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. సందర్భంగా మంత్రికి చిన్న మడూరు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, పాల్గొన్నారు.