హైదరాబాద్ : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ సమన్యాయం చేస్తున్నారని హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు పి శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీజేపీ ఎస్సీ సెల్ హైదరాబాద్ పార్లమెంటరీ మాజీ ఇన్చార్జి గాదం సత్యనారాయణతో పాటు గౌలిపురకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అగ్రస్థానంలో నిలబెట్టారని పేర్కొన్నారు. ఎనిమిది ఏండ్ల పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాల ప్రవేశపెట్టారని తెలిపారు . బీఆర్ఎస్ నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి ఇబ్బందులను తెలుసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆజం అలీ, బద్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.