ధరూరు, ఏప్రిల్ 29: కారే మాకు బతుకు, కేసీఆరే మా భరోసా అని ఉపాధిహా మీ కూలీలు పేర్కొన్నారు. జోగుళాంబ గద్వా ల జిల్లాలోని గద్వాల, ధరూరు, గట్టు, మల్దకల్, కేటీదొడ్డి మండలాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ధరూరు మండలంలోని కోతులగిద్ద స్టేజీ వద్ద ఉపాధి పనులు చేస్తున్న కూలీలను కలిసి ముచ్చటించారు.
‘వ్యవసాయం బాగుందా.. పింఛన్ వస్తుందా?’ అని కూలీలను అడిగారు. ‘ఎక్కడయ్యా.. కేసీఆర్ సారు ఉన్నన్ని రోజులు భూములన్నీ పంటపొలాలతో కళకళలాడేవి.. రైతుబంధు, పింఛన్లు సక్కగా వచ్చేవి. ఏదో మా దురదృ ష్టం కొద్ది ఆయన అధికారంలో లేడు. అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఆ తప్పు ను సరిదిద్దుకొనే అవకాశం ఈ ఎన్నికల రూపంలో వచ్చింది. బండ్ల కృష్ణమోహన్రెడ్డినే మా ధైర్యం.. కారు గుర్తుకు తప్ప దేనికీ ఓటేయం.. మీరు ధైర్యంగా ఉండండి.. ఈ సారి ఎన్నికల్లో మీదే విజయం’ అని కూలీలు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భరోసానిచ్చారు.