హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన మహాధర్నాలో సోమవారం విద్యుత్ ఉద్యోగులు పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు.. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ జనరేటింగ్ స్టేషన్లు, సర్కిల్, డివిజన్ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలతో విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
కేంద్రం చట్ట సవరణ పేరుతో డిస్కంలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతుందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు చేస్తున్న ఉద్యమంలో ప్రజలు సహకరించాలన్నారు. కేంద్రం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాలో..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో..
సిద్దిపేట జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో..
జగిత్యాల జిల్లాలో..