హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలతోపాటు పలు పురపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల నిర్వహణలో కొవిడ్ నిబంధనలు అమలుచేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల అధికారి, పురపాలకశాఖ కమిషనర్ సత్యనారాయణ, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు శివబాలాజీరెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యదర్శి అశోక్కుమార్, ఓఎస్డీ జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఈసీ చేసిన సూచనలు
పోలింగ్, కౌంటింగ్ రోజులలో ప్రతి ఒకరు తప్పనిసరిగా మాస్ ధరించాలి, పోలింగ్ కేంద్రాలను శానిటైజ్ చేయాలి, ఓటేసేందుకు వచ్చేవారు చేతులను శానిటైజ్ చేసుకోవాలి. ప్రజలు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలి. ఈ నిబంధనల పర్యవేక్షణకు బాధ్యతాయుతమైన అధికారిని నియమించాలి.
పోలింగ్, పోలీస్ సిబ్బందిని తరలించే వా హనాల్లో 50% మందినే అనుమతించా లి. ప్రతి మున్సిపాలిటీలో హెల్త్ నోడల్ అ ధికారులను, పోలింగ్ కేంద్రంలో ఇద్దరు ఆరోగ్య సిబ్బందిని అవసరమైన మెడికల్ కిట్లతో అందుబాటులో ఉంచాలి. పోలిం గ్ కేంద్రాల వద్ద పెద్ద షామియానాలు ఏర్పాటుచేసి, ఓటర్లకు కుర్చీలు వేయాలి.
పోలీసులు, పోలింగ్ సిబ్బందికి ఈ నెల 29, 30 తేదీల్లో, కౌంటింగ్ సిబ్బందికి 3వ తేదీన పరిశుభ్రమైన, సురక్షిత ఆహారం, రక్షిత తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలి.
కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్లను విశాలమైన గదులలో ఏర్పాటుచేయాలి. వాటిని ముందే శానిటైజ్ చేయాలి. ఏ సమయంలోనైనా కౌంటింగ్ హాల్లో 50 మందికి మించి ఉండరాదు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని అనుమతించరాదు.
ఫలితాల తర్వాత ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు. రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికైన ధ్రువపత్రం అందుకోవడానికి అభ్యర్థితోపాటు మరొకరిని మాత్రమే అనుమతించాలి.
పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది ఆరోగ్యసేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
‘పోలింగ్, కౌంటింగ్ రోజున గుంపులు ఉండకూడదు. నలుగురికంటే ఎకువమంది ఒక చోట చేరకుండా చూడాలి. అవసరమైతే 144 సెక్షన్ అమలుచేయాలి. ప్రతి ఒకరూ తప్పనిసరిగా మాస్ ధరించాలి. పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశిస్తున్న ప్రతి ఒకరు చేతులను శానిటైజ్ చేసుకోవాలి. ఇందుకు ఒక బాధ్యతాయుతమైన ఇంచార్జ్ను నియమించి, అవసరమైన శానిటైజర్లను సిద్ధంగా ఉంచాలి’