జ్యోతినగర్, నవంబర్ 27: పెద్దపల్లి రామగుండం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి ఎన్నికల సిబ్బంది నిర్వహించి తనిఖీల్లో భారీగా నగదు దొరికింది. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ఫ్లయింగ్ స్కాడ్ సిబ్బంది రూ.2,18,90,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
సీ విజిల్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్లయింగ్ స్కాడ్ ఎన్టీపీసీ కృష్ణానగర్లోని ఓ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ మొత్తం లభించింది. ఎలాంటి ఆధారాలు లేనందున నగదును సీజ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. నగదుతోపాటు జాతీయ పార్టీకి చెందిన కరపత్రాలు లభించినట్టు వెల్లడించారు. అలాగే రామగుండం బీ పవర్హౌస్ వద్ద ఎఫ్ఎస్టీ బృందం చేపట్టిన వాహన తనిఖీల్లో రూ. 50 లక్షలు పట్టుకున్నట్టు తెలిపారు.