జోగులాంబ గద్వాల : జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హామీనిచ్చారు. బుధవారం ఆలయ ఆవరణలో షెడ్ నిర్మాణానికి, విష్ణువు ఆలయంలో గాలి గోపురం నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేయాలని ఆలయ కమిటీకి సూచించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన