హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పా లనలో విద్యారంగం గొప్ప ప్రగతి సాధించిందనడానికి నీతి ఆయోగ్ వెల్లడించిన గణాంకాలే సాక్ష్యమని మాజీ మంత్రిహరీశ్రావు స్పష్టం చేశారు. రాజకీయాల కోసం కేసీఆర్పై అసత్య ప్రచారాలు చేసేవారికి ఈ నివేదిక చెంపపెట్టుగా అభివర్ణించారు. నీతి ఆయోగ్ సూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా (2014-15 నుంచి 2024-25) నివేదికపై హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో జీరో డ్రాపౌట్స్ నమో దు కావడాన్ని నీతి ఆ యోగ్ ప్రశంసించిందని, ఇది బీఆర్ఎస్ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ‘కేసీఆర్ హ యాంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్, బీజేపీ, కొంతమంది స్వ యం ప్రకటిత మేధావులు ఆరోపణల పచ్చి అబద్ధాలని నీతి ఆయోగ్ నివేదికతో తేటతెల్లమైంది’ అని చెప్పారు.
నీతి ఆయోగ్ నివేదికలోని ముఖ్యాంశాలు