నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులైన పులిదిండి ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి రెండు రోజుల (17,18 తేదీల్లో) ఈడీ కస్టడీ పూర్తయ్యింది. ఈ మేరకు న్యాయస్థానానికి ఈడీ తరఫున మెమో దాఖలు చేశారు.
కోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు జైలులోనే వారిని విచారించినట్టు ఈడీ పీపీ జగన్మోహన్ కోర్టుకు తెలిపారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వివరించారు.