హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. డీఏ విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలంటూ టీఎన్జీవోలు కూడా వినతి పత్రం సమర్పించినా, ఈసీ పట్టించుకోలేదు. డీఏ విడుదలకు అనుమతించలేదు. ఎన్నికల తర్వాత డీఏలు విడుదలయ్యే అవకాశం ఉంది.