Earthquake | సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. జిల్లా కేంద్రంతో పాటు న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూ ప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు.