హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భూమి కంపించింది. బుధవారం అర్ధరాత్రి బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో 3 సెకన్లపాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇండ్లలోని వస్తువులు ఒక్కసారిగా కిందపడ్డాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భూమి కంపించడంతో భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల భూ కదలికలు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా నమోదయ్యాయి.
గతంలో కూడా కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. ఈ మేరకు మంచిర్యాల జిల్లాకు 35 కి.మీ దూరంగా భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదైనట్టు వెల్లడించారు. సింగరేణి జోన్లో భూ ప్రకంపనలు సహజమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26, (నమస్తే తెలంగాణ): మొకల సంరక్షణలో శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, రైతులు, పరిశ్రమలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉన్నదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్హెచ్ సింగ్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ హైదరాబాద్లో మూడ్రోజులపాటు సదస్సును నిర్వహించింది.