హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్లో పలుచోట్ల ఎర్త్ అవర్ నిర్వహించారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆపివేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ), సచివాలయం, అసెంబ్లీ, చార్మినార్, అంబేద్కర్ విగ్రహం వద్ద, పలు ఇండ్లల్లో, సంస్థల్లో ఎర్త్ అవర్ను పాటించారు. టీఎస్పీసీబీ ఆధ్వర్యం లో ‘పుడమి కోసం గంట కార్యక్రమం’ నిర్వహించారు. భూమిని కాలుష్యం నుంచి పరిరక్షిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. భూమి రక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మార్చి 23న ఎర్త్ అవర్ను పాటిస్తున్న విషయం తెలిసిందే.