నిజామాబాద్ : ఎగువ రాష్ట్రాలతో పాటు కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది.
సాలురా వద్ద గల పాత బ్రిడ్జి పైనుంచి వరద ప్రమాదకరరీతిలో ప్రవహిస్తున్నది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంజీరా తీరప్రాంతంలోని గ్రామాలు జలమయమయ్యాయి. కాగా, బ్రిడ్జి వద్ద ప్రమాద సూచికలు పెట్టకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.