ములుగు రూరల్, మే 11 : మండలంలోని కన్నాయిగూ డెం, రాంనగర్ గ్రామాల్లోని తు నికాకు కల్లాలను ములుగు ఎఫ్డీవో నిఖిత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తునికాకు సేకరణలో ఎక్కువ మంది భాగస్వామ్యమయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఫారెస్టు సిబ్బందిని ఆదేశించా రు. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆకు సేకరణ చేపట్టాలన్నారు. రోజూవారీగా సేకరించిన తునికాకు వివరాలను రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట రేంజ్ ఆఫీసర్ సృజన, సెక్షన్ ఆఫీసర్ వెంకన్న, బీట్ ఆఫీసర్ మోహన్ తదితరులు ఉన్నారు.