నల్లగొండ, మార్చి 4 : ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. నల్లగొండ పట్టణ సమీపంలోని కేశరాజు పల్లిలో నీరు లేక ఎండుతున్న వరి పొలాలకు ట్యాంకర్ ద్వారా రైతులు నీళ్లు పెడుతున్న విషయం నమస్తే తెలంగాణలో ప్రచురితం కాగా వారు అక్కడికి వెళ్లి వరి పొలాలను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ దాసరి హరిచందనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా కమిటీ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు, పాలడుగు నాగార్జున, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, తదితరులు పాల్గొన్నారు.