Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు కంటితుడుపుగా మంగళవారం గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా రెండు ట్రిప్పుల నీటిని సరఫరా చేశారు. అయితే.. ఆ నీరు గ్రామంలో ఏ మూలకూ సరిపోక ట్యాంకర్ వద్ద మహిళల మధ్య తోపులాట జరిగింది.
‘కేసీఆర్ గారి హయాంలో సాగు, తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడలేదు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే ఏమీ చేయలేక లబోదిబోమంటున్నాం. కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు’ అంటూ మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు.
ఇదే మండలంలోని జటప్రోల్, గోప్లాపురం, మంచాలకట్ట, ఎంగంపల్లి తండా గ్రామాల్లో కూడా వారం రోజులుగా తాగునీరు రావడం లేదు.
నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు కంటితుడుపుగా మంగళవారం గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా రెండు ట్రిప్పుల నీటిని సరఫరా చేశారు. అయితే.. ఆ నీరు గ్రామంలో ఏ మూలకూ సరిపోక ట్యాంకర్ వద్ద మహిళల మధ్య తోపులాట… pic.twitter.com/WjQTfL8xHk
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 10, 2024